వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కల్తీ మద్యం సేవించి 12 మంది మృతి
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో కల్తీ మద్యం తాగి 12 మంది మృతి చెందారు. మరో ఆరుగురు అస్వస్థత పాలయ్యారు. అస్వస్థతకు గురైనవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్చారు. మృతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని ఆందోళనకు దిగాయి. వ్యక్తిగత కక్షలతో మద్యంలో విషం కలిపి వుంటారని ఆనుమానిస్తున్నారు.
కల్తీ మద్యం సరఫరా చేసిన ఇద్దరిని గుర్తించామని శ్రీకాకుళం పోలీసు సూపరింటిండెంట్ (యస్పీ) గురప్ప చెప్పారు. నిందితుల కోసం గాలిస్తున్నామని ఆయన చెప్పారు. నాటుసారా తాగవద్దని ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ సరిహద్దు గ్రామాల్లో పోలీసులు దండోరా వేయిస్తున్నారు. మృతుల కుటుంబాలకు మంత్రి కొణతాల రామకృష్ణ లక్ష రూపాయలేసి ఎక్స్గ్రేషియా ప్రకటించారు.
Comments
Story first published: Monday, March 20, 2006, 23:53 [IST]