వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సబ్‌ కోర్టు ఆవరణలో ముగ్గురి దారుణ హత్య

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా పరిగి సబ్‌ కోర్టులో ముగ్గురు దారుణ హత్యకు గురయ్యారు. ఒక హత్య కేసులో నిందితులైన ముగ్గురిని ప్రత్యర్థులు సబ్‌ కోర్టు ఆవరణలో హత్య చేశారు. హత్యకు గురైనవారు కడమూరు గ్రామానికి చెందినవారు. హతులు ఇద్దరు సోదరులు, ఒక మహిళ ఉన్నారు. హత్యకు గురైనవారిని నర్సింహులు, రాజయ్య, శాంతమ్మలుగా గుర్తించారు.

హత్యకు గురైన వారు 2005లో జరిగిన ఒక హత్య కేసులో నిందితులు. ఈ ముగ్గురి హత్య కేసులో తొమ్మిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. విచారణకు హాజరయ్యేందుకు కోర్టుకు వస్తుండగా ప్రత్యర్థులు దారి కాచి వేటకొడవళ్లతో దాడి చేసి నరికి చంపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X