వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పోలీసు స్టేషన్లో పూజారి ఆత్మహత్య
గుంటూరు: పోలీసుల వేధింపులు భరించలేక గుంటూరు జిల్లా నర్సారావుపేట పోలీసు స్టేషన్లో ఒక అర్చకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఒక కిడ్నాప్ కేసులో పరహరి శేషు పవన్ అనే పూజారిని పోలీసులు స్టేషన్కు పిలించారు. కిడ్నాప్ వ్యవహారంపై ఆయనను ఆదివారం సాయంత్రం పోలీసులు ప్రశ్నించి పంపించివేశారు.
తిరిగి సోమవారంనాడు వపన్ను మళ్లీ పోలీసులు స్టేషన్కు పిలిపించి ప్రశ్నించడం మొదలు పెట్టారు. ఈ సమయంలో పక్కనే ఉన్న ట్యూబ్లైట్ను పగులగొట్టి పవన్ పొడచుకున్నాడు. తీవ్రంగా గాయపడిన అతన్ని ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు.
Story first published: Monday, March 20, 2006, 23:53 [IST]