వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రాష్ట్ర రాజకీయాలను వేడెక్కించాం: వెంకయ్య
నెల్లూరు: తెలంగాణపై తమ వైఖరి వెల్లడితో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కాయని భారతీయ జనతా పార్టీ (బిజెపి) సీనియర్ నేత ఎం. వెంకయ్యనాయుడు అన్నారు. ఆంధ్ర, తెలంగాణ రెండు రాష్ట్రాలు ఏర్పడాలనేది తమ విధానమని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. మీడియాపై మంత్రి జె.సి. దివాకర్ రెడ్డి వ్యాఖ్యలను ఆయన ఖండించారు.
మీడియాపై భౌతికదాడులు, బెదిరింపులు ప్రజాస్వామ్యానికి మంచివి కావని ఆయన అన్నారు. వార్తలను ఖండించడానికి వీలున్నప్పుడు మీడియాపై సహనం కోల్పోయి వ్యవహరించడం మంచిది కాదని ఆయన అన్నారు. అధికారంలో వున్నవారు సహనం, సంయమనాలతో వ్యవహరించాలని ఆయన సూచించారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో మీడియాపై దాడులు, బెదిరింపులు పెరుగుతున్నాయని ఆయన విమర్శించారు. దాడులు, బెదిరింపులో పత్రికల గొంతు నొక్కలేరని ఆయన అన్నారు.
Comments
Story first published: Monday, March 20, 2006, 23:53 [IST]