వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రెండు బస్సులు ఢీకొని నలుగురు దుర్మరణం
సిద్ధిపేట: మెదక్ జిల్లాలో మంగళవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మరణించారు. 33 మంది గాయపడ్డారు. ఇందులో 18 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. నలుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. ఎదురెదురుగా వస్తున్న రెండు ఆర్టీసి బస్సులు ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది.
మంగళవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో సిద్ధిపేట నుంచి వస్తున్న గోదావరిఖని బస్సు, సిద్ధిపేట బస్సు గజ్వెల్ మండలం ప్రజ్ఞాపూర్కు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో సిద్ధిపేట డిపోలో సూపరింటిండెంట్గా పని చేస్తున్న శిల్ప అనే మహిళ కూడా మరణించింది. క్షతగాత్రులను సికింద్రాబాద్లోని గాంధీ ఆస్పత్రిలో చేర్చారు.
Comments
Story first published: Tuesday, March 21, 2006, 23:53 [IST]