వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రెండు బస్సులు ఢీకొని నలుగురు దుర్మరణం

By Staff
|
Google Oneindia TeluguNews

సిద్ధిపేట: మెదక్‌ జిల్లాలో మంగళవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మరణించారు. 33 మంది గాయపడ్డారు. ఇందులో 18 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. నలుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. ఎదురెదురుగా వస్తున్న రెండు ఆర్టీసి బస్సులు ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది.

మంగళవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో సిద్ధిపేట నుంచి వస్తున్న గోదావరిఖని బస్సు, సిద్ధిపేట బస్సు గజ్వెల్‌ మండలం ప్రజ్ఞాపూర్‌కు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో సిద్ధిపేట డిపోలో సూపరింటిండెంట్‌గా పని చేస్తున్న శిల్ప అనే మహిళ కూడా మరణించింది. క్షతగాత్రులను సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో చేర్చారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X