టిడిపిని ఎండగట్టేందుకే ఫైళ్లు చూపుతాం: వైయస్
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీని ఎండగట్టడానికే ఎల్లంపల్లి ప్రాజెక్టు ఫైళ్లను చూపాలని నిర్ణయించుకున్నట్లు ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి అన్నారు. నిజానికి ఎల్లంపల్లి ఫైళ్లను చూపాల్సిన అవసరమే లేదని ఆయన మంగళవారంనాడు అన్నారు. ఫైళ్లను మంత్రి వద్ద పెట్టడంలో తప్పు లేదని ఆయన చెప్పుకున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు విషయంలో తెలుగుదేశం పార్టీ మోసం తేటతెల్లమైందని ఆయన వ్యాఖ్యానించారు.
తెలంగాణ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించే ఎల్లంపల్లి ప్రాజెక్టును అడ్డుకుంటే ప్రజలు సహించరని భారీ నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య న్నారు. రాజకీయ మనుగడ కోసమే తెలుగుదేశం పార్టీ ఎల్లంపల్లి ప్రాజెక్టు విషయంలో లేనిపోని విమర్శలు చేస్తోందని ఆయన విమర్శించారు. ప్రతిపక్ష నాయకుడిగా విఫలమైన చంద్రబాబునాయుడు రాజీనామా చేయాలని కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ డిమాండ్ చేసింది.