టిడిపి మాక్ అసెంబ్లీకి స్పీకర్ బ్రేక్
హైదరాబాద్: ఎల్లంపల్లి ప్రాజెక్టు అక్రమాలపై చర్చకు పట్టుబట్టి రెండు రోజుల పాటు శాసనసభ నుంచి సస్పెండ్ అయిన తెలుగుదేశం శాసనసభ్యులు గురువారం మాక్ అసెంబ్లీ నిర్వహించారు. శాసనసభ ఆవరణలోనే వారు మాక్ అసెంబ్లీ నిర్వహించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టుపై చర్చను వారు వ్యంగ్యంగా ప్రదర్శించారు. దూళిపాళ్ల నరేంద్ర ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డిగా, నరేంద్రారెడ్డి ముఖ్యమంత్రిగా నటించారు. ప్రభుత్వం తీరుపై వారు వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
కొన్ని తెలుగు టీవీ చానళ్లు ఈ మాక్ అసెంబ్లీని ప్రత్యక్ష ప్రసారం చేయడానికి పూనుకున్నాయి. ఇది గమనించిన స్పీకర్ కె. ఆర్. సురేష్ రెడ్డి మాక్ అసెంబ్లీ ప్రత్యక్ష ప్రసారాన్ని ఆపేయాలని ఆదేశాలు జారీ చేశారు. మాక్ అసెంబ్లీని ప్రత్యక్ష ప్రసారం చేస్తున్న మీడియా కేబుళ్లను శాసనసభ భద్రతా సిబ్బంది తొలగించారు. కాగా, మరో ఇద్దరు తెలుగుదేశం సభ్యులను స్పీకర్ గురువారంనాడు సస్పెండ్ చేశారు.