పోలవరంపై ఏజెన్సీలో సిపియం బంద్
భద్రాచలం: పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపేయాలని డిమాండ్ చేస్తూ సిపియం ఏజెన్సీ ప్రాంతాల్లో బంద్ నిర్వహించింది. గిరిజనులు బంద్లో పెద్ద యెత్తున పాల్గొన్నారు. ఖమ్మం జిల్లాలోని భద్రాచలం ఏజెన్సీ ప్రాంతాల్లోని 29 మండలాల్లో బంద్ జరిగింది. ఆస్పత్రులకు వెళ్లే రోగులను, పరీక్షలకు వెళ్లే విద్యార్థులను బంద్ నుంచి మినహాయించారు. విజయవాడ, ఖమ్మం, తదితర ప్రాంతాల నుంచి గిరిజన ప్రాంతాలకు వెళ్లే దారులను గిరిజనులు మూసేశారు.
భద్రాచలం, ఇల్లందు, మణుగూరు ఆర్టీసి బస్సులను నడపలేదు. ఈ సందర్భంగా పోలీసులు పలువురు సిపియం కార్యకర్తలను అరెస్టు చేశారు. ఏజెన్సీ ప్రాంతాలతో ప్రత్యేక జిల్లాను ఏర్పాటు చేయాలనే డిమాండ్ కూడా ఈ సందర్భంగా ముందుకు వచ్చింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపేయకపోతే త్వరలో చలో పోలవరం కార్యక్రమాన్ని చేపడతామని సిపియం ప్రకటించింది. అన్ని పార్టీలను కలుపుకొని ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని అనుకుంటున్నట్లు సిపియం రాష్ట్ర కార్యదర్శి బి.వి. రాఘవులు హైదరాబవాద్లో చెప్పారు. గిరిజనుల సమస్యలపై సిపియం నాయకులు గవర్నర్కు ఒక వినతిపత్రం సమర్పించారు.