వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
హైదరాబాద్ శివారులో ఇల్లు దోపిడీ
హైదరాబాద్: హైదరాబాద్ శివారులోని చందానగర్లో జరిగిన దోపిడీ సంచలనం సృష్టించింది. ఇంటివారందరికీ దొంగలు మత్తు మందు ఇచ్చి దోపిడీకి పాల్పడ్డారు. అనంతరెడ్డి అనే గ్రానైట్ వ్యాపారి ఇంట్లో దొంగలు చాకచక్యంగా దోపిడీకి పాల్పడ్డారు. దొంగలు పది లక్షల రూపాయల నగదు, బంగారు నగలు దోచుకెళ్లారు.
వెలుతురు కోసం ఏర్పాటు చేసుకున్న గాజు కిటికీ గుండా దొంగలు ఇంటిలోకి ప్రవేశించి ఇంట్లోనివారందరికీ మత్తు మందు ఇచ్చి దోచుకున్నారు. ఇంటిలోకి ఐదుగురు దొంగలు వచ్చారని, బయట ఎంత మంది వున్నారో తెలియదని ఇంటి యజమాని అనంతరెడ్డి అంటున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దొంగల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
Comments
Story first published: Friday, March 24, 2006, 23:53 [IST]