వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ముషారఫ్, నేనూ శాంతిపై మాట్లాడుకున్నాం: పియం
అమృతసర్: శాంతి సాధన తప్ప మరో మార్గం లేదని తాను, పాకిస్థాన్ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ అంగీకారానికి వచ్చినట్లు ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ చెప్పారు. పాకిస్థాన్ ప్రతి సమస్యనూ కాశ్మీర్తో ముడిపెట్టడం సరి కాదని ఆయన అన్నారు. అమృతసర్లోని బహిరంగ సభలో ఆయన శుక్రవారం మాట్లాడారు. అమృతసర్, నానా కానా సాహెబ్ మధ్య బస్సు సర్వీసుకు ఆయన పచ్చజెండా ఊపారు.
కాశ్మీర్పై ఆచరణాత్మక పరిష్కారం చూపితే పాకిస్థాన్తో చర్చలకు భారత్ సిద్ధమేనని ఆయన చెప్పారు. సమస్యలన్నీ ఒక రోజులో పరిష్కారం కావని ఆయన అన్నారు. సియాచిన్, సర్క్రీక్, బాగ్లీహార్ల పరిష్కారం సాధ్యమేనని ఆయన అన్నారు. తీవ్రవాదానికి వ్యతిరేకంగా ముషారఫ్ తీసుకుంటున్న చర్యలు సాహసికమని ఆయన ప్రశంసించారు. పాకిస్థాన్లో ఉరిశిక్ష పడిన సరబజీత్ కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు.
Comments
Story first published: Friday, March 24, 2006, 23:53 [IST]