వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నక్సలైట్ల మందుపాతరకు 13 మంది బలి
రాయ్పూర్: చత్తీస్ఘర్లోని కంకర్ జిల్లాలో శనివారం మావోయిస్టులు పెట్టిన మందుపాతరకు ఒక ప్రైవేటు వాహనంలో ప్రయాణిస్తున్న 13మంది బలయ్యారు. నలగురు పిరిస్థితి ఆందోళనరంగా ఉందని పోలీసులు తెలిపారు. పకంజుర్ పోలీస్టేషన్ పరిధిలో ఈ దుర్ఘటన జరిగింది. కొంత మంది వ్యాపారస్తులు సంఘం గ్రామం నుంచి ఒక ప్రైవేటు వాహనంలో తిరిగి వస్తుండగా అది పోలీసు వాహనంగా భావించిన నక్సలైట్లు మందుపాతర పెల్చటంతో ఈ దుర్ఘటన జరిగిందని పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు హుటా హుటిన సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు.
Comments
Story first published: Saturday, March 25, 2006, 23:53 [IST]