వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రాయపాటి తిరుగుబాటు బావుటా
హైదరాబాద్: గుంటూరు కాంగ్రెస్ ఎంపీ రాయపాటి సాంబశివరావు దాదాపు తిరుగుబాటు బావుటా లేవనెత్తారు. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్ధితుల్లో లోక్సభను రద్దు చేసి, తాజాగా ఎన్నికలు జరిపించాలని ఆయన కోరడం విశేషం. రాష్ట్రం నుంచి కేంద్రంలో చాలా మంది మంత్రులు ఉన్నా జరిగిన అభివృద్ధి శూన్యమని ఆయన అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్లో కమ్మ వారికి అన్యాయం జరుగుతోందని గతంలో ఒకసారి బహిరంగంగా ప్రకటించిన రాయపాటి వైఎస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గిర్గ్లానీ సిఫార్సులను ఆమోదించడం, అమలు చేయడం సమంజసం కాదని రాయపాటి అన్నారు.
Comments
Story first published: Saturday, March 25, 2006, 23:53 [IST]