వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
హక్కుల ఉల్లంఘనపై బాబుపై చర్యకు డిమాండ్
హైదరాబాద్: ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సంబంధించి నకిలీ పత్రాలను ప్రవేశపెట్టిన ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడిపై సభా హక్కుల ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సియల్పి) డిమాండ్ చేసింది. తెలుగుదేశం పార్టీ సభ్యులు ఎల్లంపల్లిపై నకిలీ పత్రాలు చూపారని మంత్రి కొణతాల రామకృష్ణ, శాసనసభ్యుడు కిరణ్కుమర్ రెడ్డి తదితరులు ఆదివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.
ఫైళ్లు చూపితే బండారం బయట పెడతామన్న తెలుగుదేశం నాయకులు ఫైళ్లను చూడకుండానే అర్థాంతరంగా వెళ్లిపోయారని వారన్నారు. తెలుగుదేశం పార్టీ ఎల్లంపల్లి ప్రాజెక్టు విషయంలో తప్పుడు ఆరోపణలు చేస్తోందని వారన్నారు.
Comments
Story first published: Sunday, March 26, 2006, 23:53 [IST]