వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్‌తో తాడోపేడో తేలిపోతుంది: నరేంద్ర

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: తెలంగాణపై కాంగ్రెస్‌తో తేల్చుకోవడమో, తెంచుకోవడమో త్వరలో తేలిపోతుందని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అగ్రనేత, కేంద్ర మంత్రి ఎ. నరేంద్ర అన్నారు. తెరాస కార్యవర్గ సమావేశంలో ఆయన ఆదివారంనాడు ప్రసంగించారు. తెలంగాణపై కాంగ్రెస్‌ ఏదో ఒకటి తేల్చకపోతే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. భారతీయ జనతా పార్టీ (బిజెపి) అధ్యక్షుడు రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రకటనతో తెలంగాణ ఉద్యమానికి మళ్లీ ఊపు వచ్చిందని పార్టీ మరో అగ్రనేత, కేంద్ర మంత్రి కె. చంద్రశేఖర్‌ రావు అన్నారు.

పార్టీ అసమ్మతి శాసనసభ్యులపై ఇరువురు అగ్రనేతలు కూడా తీవ్రంగా ధ్వజమెత్తారు. అసమ్మతి శాసనసభ్యులు దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని చంద్రశేఖర్‌ రావు పిలుపునిచ్చారు. ప్రస్తుత స్థితి కొనసాగితే త్వరలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణపై కాంగ్రెస్‌ ఇచ్చిన హామీ ఏమటనేది ఆయన ప్రస్తావించలేదు. అసంఘటిత కార్మికుల కమీషన్‌ పదవికి రాజీనామా చేసిన తెరాస సిద్ధాంత కర్త ప్రొఫెసర్‌ జయశంకర్‌ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X