వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆత్మరక్షణ కోసమే పోలీసు కాల్పులు: జానారెడ్డి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: ఆత్మరక్షణ కోసమే పోలీసులు గంగవరం ఆందోళనకారులపై కాల్పులు జరిపారని హోం మంత్రి కె. జానారెడ్డి స్పష్టం చేశారు. గంగవరం సంఘటనపై ఆయన సోమవారం ఉదయం ఒక ప్రకటన చేశారు. ఆందోళనకారులను చెదరగొట్టడానికి పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారని, ఆందోళనకారులు మరింత హింసకు దిగారని, దీంతో పోలీసులు కాల్పులు జరిపారని ఆయన వివరించారు. ఈ సంఘటనలో చౌడపల్లి నూకరాజు అనే స్టీల్‌ ప్లాంట్‌ కార్మికుడు మరణించినట్లు ఆయన తెలిపారు. ఆందోళనకారులు రాళ్లు రువ్విన ఘటనలో ఎసిపి ముఖానికి గాయం తగిలిందని, మరో 22 మంది పోలీసులు గాయపడ్డారని ఆయన తెలిపారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని ఆయన చెప్పారు.

పోలీసులు ఆత్మరక్షణ కోసమే కాల్పులు జరిపారని విశాఖపట్నం నగర కమీషనర్‌ కౌముది అన్నారు. ఆందోళనకారులపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. పోలీసులపై మత్స్యకారులు దాడికి దిగడం సరి కాదని, ప్రజాస్వామ్యంలో ఇది ఖండనార్హమని ఆయన అన్నారు. ఏ సమస్యనైనా శాంతియుతంగా చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చునని, పోలీసులపైకే దాడి చేస్తే పాలనా యంత్రాంగం ఏమవుతుందని ఆయన అన్నారు. ఆందోళనకారులను అదుపు చేయడానికి పోలీసులు అన్ని ముందస్తు చర్యలు తీసుకున్నారని, గాలిలోకి కాల్పులు జరిపినప్పుడు మరింత ఆందోళనకారులు రెచ్చిపోయారని, దీంతో కాల్పులు జరపాల్సి వచ్చిందని ఆయన అన్నారు. చర్చలు జరపడానికి అధికారులు, నాయకులు అందుబాటులో వున్నా మత్స్యకారులు ఆందోళనకు దిగడం సరి కాదని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X