వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేపు తెలుగుదేశం విశాఖ బంద్‌

By Staff
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం/హైదరాబాద్‌: గంగవరం మత్స్యకారులపై పోలీసుల కాల్పులకు నిరసనగా రేపు విశాఖపట్నం బంద్‌కు తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చింది. గంగవరం పోర్టు వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. తెలుగుదేశం, సిపియం నాయకులను దాదాపు యాబై మందిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసు కాల్పుల్లో ఒకరు మరణించగా, తీవ్రంగా గాయపడిన మరొకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.

గంగవరం సంఘటనపై నిజనిర్ధారణకు తెలుగుదేశం హైదరాబాద్‌ నుంచి నలుగురు శాసనసభ్యులతో కూడిన బృందాన్ని సంఘటనా స్థలానికి పంపింది. సిపియం, సిపిఐ నాయకులు హుటాహుటిన హైదరాబాద్‌ నుంచి సంఘటనా స్థలానికి బయలుదేరి వెళ్లారు. పోలీసు చర్యను సిపిఐ కార్యదర్శి నారాయణ తీవ్రంగా ఖండించారు. సంఘటనపై న్యాయవిచారణ జరిపించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X