వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వరంగల్లో 17 మంది నక్సల్స్ లొంగుబాటు
వరంగల్: మావోయిస్టులకు మంగళవారంనాడు తీవ్రమైన దెబ్బ తగలింది. ఐదుగురు మావోయిస్టులతో పాటు 17 మంది నక్సలైట్లు వరంగల్ డిఐజి మీనా, పోలీసు సూపరింటిండెంట్ (యస్పీ) స్టీఫెన్ రవీందర్ల ముందు లొంగిపోయారు. లొంగిపోయినవారిలో ఒక దళ కమాండర్తో పాటు ఒక డిప్యూటీ దళ కమాండర్ ఉన్నాడు. లొంగిపోయినవారిలో వెంకన్న అప్పరాజుపల్లి ఎంపిటిసి సభ్యుడు ఉండడం విశేషం.
లొంగిపోయిన నక్సలైట్లలో వరంగల్ జిల్లాకు చెందినవారే కాకుండా కరీంనగర్ జిల్లాకు, ఛత్తీస్ఘడ్ రాష్ట్రానికి చెందినవారూ ఉన్నారు. లొంగిపోయిన నక్సలైట్ల నుంచి ఏడు తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. నక్సలైట్లను తిప్పికొట్టాలని స్టీఫెన్ రవీంద్ర ప్రజలకు పిలుపునిచ్చారు. ఆత్మరక్షణ కోసం నక్సలైట్లపై దాడి చేసేవారిని తాము సమర్థిస్తామని ఆయన మీడియా ప్రతినిధులతో చెప్పారు.
Comments
Story first published: Tuesday, March 28, 2006, 23:53 [IST]