వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మీడియా ప్రతినిధులపై పోలీసు మార్కు దాడి

By Staff
|
Google Oneindia TeluguNews

నెల్లూరు: ఒక కేసులో అవినీతి నిరోధక శాఖ ( ఎసిబి) కోర్టుకు హాజరు కావడానికి వచ్చిన కాకినాడ అదనపు పోలీసు సూపరింటిండెంట్‌ ( ఎయస్‌పి) రాధా బంధువులు మీడియా ప్రతినిధులపై దాడి చేశారు. ఎయస్‌పి ఫొటో తీయకుండా అతని కొడుకు, బావమరిది పోలీసుల సాక్షిగా దాడి చేసి కొట్టారు. ఒక కెమెరామన్‌పై దాడి చేసి కెమెరాను ధ్వంసం చేశారు.

మీడియా ప్రతినిధులపై రాధా కొడుకు, బావమరిది దాడి చేయడాన్ని పోలీసులు చూస్తూ మిన్నకున్నారు. దాడి చేసి దర్జాగా అక్కడి నుంచి వెళ్లిపోయారు. రాధా కొడుకు, బావమరదులపై నాలుగో టౌన్‌ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే కేసులో రాధాను మంగళవారం నెల్లూరు ఎసిబి కోర్టులో హాజరు పరిచారు. ఇటీవల రాధా ఇళ్లపై ఎసిబి అధికారులు దాడులు నిర్వహించారు. ఆ సందర్బంగా గుండెనొప్పి సాకుతో రాధా హైదరాబాద్‌లోని ఒక కార్పోరేట్‌ ఆస్పత్రిలో చేరారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X