గంగవరం బాధితులకు బాబు బాసట
విశాఖపట్పం: గంగవరం బాధితులకు అన్ని రకాలుగా మద్దతు ఇస్తామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. ఆయన మంగళవారంనాడు కింగ్జార్జి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. పోలీసు కాల్పుల్లో మరణించిన నూకరాజు కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. గంగవరం బాధితులకు న్యాయం జరిగేవరకు పోరాటం చేస్తామని ఆయన విశాఖపట్నం విమానాశ్రయంలో విలేలకరులతో చెప్పారు. గంగవరం బాధితులకు న్యాయం చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు.
గంగవరం సంఘటన బాధితులను పరామర్శించడానికి సిపియం నాయకులు నోముల నర్సింహయ్య, గఫూర్ కూడా వచ్చారు. వారు బాధితులను పరామర్శించారు. ప్రభుత్వంపై నోముల నర్సింహయ్య తీవ్రంగా ధ్వజమెత్తారు. గంగవరం పోర్టు పనులను వెంటనే ఆపేయాలని ఆయన డిమాండ్ చేశారు. విశాఖ -1 ఉప ఎన్నికలో కాంగ్రెస్ మద్దతు ఇచ్చే విషయాన్ని పునరాలోచిస్తామని ఆయన చెప్పారు. ప్రజా సమస్యలపై అంశాలవారీగా ఏ పార్టీతోనైనా కలిసి పని చేస్తామని ఆయన చెప్పారు.