వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అసెంబ్లీ ముందు ఆత్మహత్యాయత్నం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: అధికారులు ఇంటి పట్టా ఇవ్వనందుకు మనస్తాపం చెందిన ఒక కుటుంబం యావత్తు మంగళవారం శాసనసభ వద్ద ఆత్మహత్యకు ప్రయత్నించింది. రంగారెడ్డి జిల్లా శేర్‌లింగంపల్లికి చెందిన శంకర్‌ అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో ఆత్మహత్యకు ప్రయత్నించాడు. శంకర్‌తో పాటు అతని కుటుంబ సభ్యులను హైదరాబాద్‌లోని సైఫాబాద్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

తనకు ఇల్లు కేటాయించి పట్టా ఇవ్వడంలేదని, పట్టా కోసం వెళ్తే అధికారులు ఇష్టమొచ్చిన రీతిలో మాట్లాడుతున్నారని శంకర్‌ అంటున్నాడు. శంకర్‌ కుటుంబ సభ్యులు గతంలో కూడా ఒకసారి రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ముందు ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X