వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మత్స్యకారులకు అండగా ఉద్యమం: చంద్రబాబు
విశాఖపట్నం: గంగవరం మత్స్యకారుల డిమాండ్లకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్త ఉద్యమం నిర్వహించడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు బుధవారం ఇక్కడ చెప్పారు. గంగవరం కాల్పుల్లో బాధితులను పరామర్శించడానికి ఆయన ఇక్కడికి వచ్చారు. ఉపాధి కోల్పోతున్న మత్స్యకారులకు ప్రభుత్వం చేయూత నివ్వాల్సింది పోయి, వారిని రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా చూడాలని, బాధితులకు సమగ్ర ప్యాకేజిని ప్రకటించాలని కోరారు. గంగవరం ఘర్షణలకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
Story first published: Wednesday, March 29, 2006, 23:53 [IST]