వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఇంటింటికీ ఉచిత కలర్ టీవీ: డిఎంకె మేనిఫెస్టో
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా డిఎంకె ప్రజాకర్షక మేనిఫెస్టోను ప్రకటించింది. ప్రతి కుటుంబానికి కలర్ టీవీ సెట్ను ఉచితంగా అందిస్తామని, రెండు రూపాయలకే కిలో బియ్యం అందుబాటులోకి తెస్తామని డిఎంకె ప్రకటించింది. డిఎంకె మేనిఫెస్టోను డిఎంకె అధినేత కరుణానిధి బుధవారం ఇక్కడ విడుదల చేశారు. పేద మహిళలందరికీ గ్యాస్ స్టౌలను అందజేస్తామని, గర్భిణీ స్త్రీలకు నెలకు వెయ్యి రూపాయల చొప్పున ఆరు నెలల పాటు అందజేస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. మూడు లక్షల మంది యువతీ యువకులకు ఉపాధి కల్పిస్తామన్నది మేనిఫెస్టోలోని మరో ఆకర్షణ. బస్సు చార్జీలు తగ్గిస్తామని, చేనేత కార్మికులకు రాయితీలు కల్పిస్తామని ప్రకటించింది.
Comments
Story first published: Wednesday, March 29, 2006, 23:53 [IST]