వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గంగవరం సంఘటన: డిమాండ్లకు తలొగ్గని ప్రభుత్వం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: గంగవరం కాల్పుల సంఘటనపై ప్రతిపక్ష పార్టీల డిమాండ్లన్నిటినీ రాష్ట్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. న్యాయవిచారణకు ప్రభుత్వం తిరస్కరించింది. బాధ్యులైన అధికారులపై చర్యలకు కూడా అంగీకరించలేదు. శాసనసభలో ఇచ్చిన హామీ మేరకు బుధవారం గంగవరం సంఘటనపై అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రులు రోశయ్య, జానారెడ్డి, కొణతాల రామకృష్ణ, జక్కంపూడి రామ్మోహనరావు, టిడిపి, టిఆర్‌ఎస్‌, ఉభయకమ్యూనిస్టు పార్టీలు, బిజెపి ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. విశాఖ జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌, జిల్లా కలెక్టరు కూడా సమావేశానికి వచ్చారు. ప్రతిపక్షాలు మంచి సూచనలే చేసినా ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున ఇప్పుడేమీ చేయలేమని ప్రభుత్వం చేతులెత్తేసింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X