వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
గంగవరం సంఘటన: డిమాండ్లకు తలొగ్గని ప్రభుత్వం
హైదరాబాద్: గంగవరం కాల్పుల సంఘటనపై ప్రతిపక్ష పార్టీల డిమాండ్లన్నిటినీ రాష్ట్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. న్యాయవిచారణకు ప్రభుత్వం తిరస్కరించింది. బాధ్యులైన అధికారులపై చర్యలకు కూడా అంగీకరించలేదు. శాసనసభలో ఇచ్చిన హామీ మేరకు బుధవారం గంగవరం సంఘటనపై అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రులు రోశయ్య, జానారెడ్డి, కొణతాల రామకృష్ణ, జక్కంపూడి రామ్మోహనరావు, టిడిపి, టిఆర్ఎస్, ఉభయకమ్యూనిస్టు పార్టీలు, బిజెపి ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. విశాఖ జిల్లా పోలీసు సూపరింటెండెంట్, జిల్లా కలెక్టరు కూడా సమావేశానికి వచ్చారు. ప్రతిపక్షాలు మంచి సూచనలే చేసినా ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఇప్పుడేమీ చేయలేమని ప్రభుత్వం చేతులెత్తేసింది.
Comments
Story first published: Wednesday, March 29, 2006, 23:53 [IST]