వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

5గురు ఎమ్యెల్యేలపై గవర్నర్‌కు టిడిపి ఫిర్యాదు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: శాసనసభ్యుల జోడు పదవులపై తెలుగుదేశం పార్టీ నాయకులు శుక్రవారంనాడు గవర్నర్‌ రామేశ్వర ఠాకూర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేవరకు వారు గవర్నర్‌కు ఒక వినతిపత్రం సమర్పించారు. ఐదుగురు కాంగ్రెస్‌ శాసనసభ్యులు లాభదాయకమైన జోడు పదవులు నిర్వహిస్తున్నారని తెలుగుదేశం నాయకులు కడియం శ్రీహరి, తదితరులు గవర్నర్‌ను కలిసిన అనంతరం మీడియా ప్రతినిధులతో చెప్పారు.

నెల్లూరు జిల్లాకు చెందిన ఆనం సోదరులు ఎడ్యుకేషనల్‌ సొసైటీ పదవులు నిర్వహిస్తున్నారని వారు చెప్పారు. ఆనం వివేకానంద రెడ్డి, ఆనం రాంనారాయణ రెడ్డిలు ఎడ్యుకేషనల్‌ సొసైటీ సెలెక్షన్‌ కమిటీలో కూడా వున్నారని వారు చెప్పారు. మరో ముగ్గురు శబుూసనసభ్యులు సుబ్రహ్మణ్యం నాయుడు, దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు, జంగా కృష్ణమూర్తి తిరుమల తిరపతి దేవస్థానం (టిటిడి) పాలక మండలి సభ్యులుగా ఉన్నారని వారు ఫిర్యాదు చేశారు. ఈ ఐదుగురి శాసనసభా సభ్మత్వాలను రద్దు చేయాలని వారు గవర్నర్‌ను కోరారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X