వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విరసం నేత వరవరరావు విడుదల

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: విప్లవ రచయిత సంఘం (విరసం) నేత వరవరరావుకు ప్రజా భద్రత చట్టం నుంచి విముక్తి లభించింది. వరవరరావును పోలీసులు శుక్రవారంనాడు నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. ప్రజా భద్రతపై వరవరరావుపై పెట్టిన కేసును కోర్టు కొట్టివేసింది. ఆయన శుక్రవారం సాయంత్రం జైలు నుంచి విడుదలయ్యారు.

విరసంపై నిషేధం విధించిన అనంతరం ప్రభుత్వం వరవరరావును, జి. కళ్యాణరావును అరెస్టు చేసింది. ఆ తర్వాత నవంబర్‌లో విరసంపై ప్రభుత్వం నిషేధం ఎత్తివేసింది. దీంతో వరవరరావు కోర్టులో డిశ్చార్జి పిటిషన్‌ దాఖలు చేశారు. ప్రజా భద్రత చట్టం కింద పెట్టిన కేసును కోర్టు కొట్టివేయగా మిగతా కేసుల్లో వరవరరావుకు బెయిల్‌ మంజూరయింది. దీని వల్ల ఆయన విడుదలకు మార్గం ఏర్పడింది. విరసం అధ్యక్షుడు జి. కళ్యాణరావు ఇప్పటికే విడుదలయ్యారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X