వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
హైదరాబాద్లో తల్లీకూతుళ్ల దారుణ హత్య
హైదరాబాద్: సైబరాబాద్ పోలీసు కమీషనరేట్ పరిధిలోని సరూర్నగర్లో తల్లీకూతుళ్లు హత్యకు గురయ్యారు. హంతకుల కోసం గాలిస్తున్నట్లు సరూర్నగర్ పోలీసు స్టేసన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం. చంద్రశేఖర్ చెప్పారు. ఈ హత్య స్థానికంగా సంచలనం సృష్టించింది. ఆదివారం ఉదయం తలుపులు తీయకపోగా, తలుపు కింది నుంచి ఇంట్లోంచి రక్తం బయటకు ప్రవహిస్తుండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
విజయలక్ష్మి అనే స్త్రీ తన కూతురు సంధ్యతో నివాసం ఉంటోంది. విజయలక్ష్మి ఇటీవల మహబూబ్ అనే వ్యక్తిని రెండో వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. తల్లీకూతుళ్లు గతి రాత్రి స్వల్పంగా మద్యం సేవించినట్లు తెలుస్తోంది. మహబూబ్ను పోలీసులు అనుమానిస్తున్నారు. గత రెండు రోజులుగా ఈ మహిళలతో సంబంధాల్లోకి వచ్చినవారి కోసం ఆరా తీస్తున్నట్లు చంద్రశేఖర్ చెప్పారు. తల్లీ కూతుళ్లను గొంతు కోసి హత్య చేశారు.
Comments
Story first published: Sunday, April 2, 2006, 23:53 [IST]