వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అధికారులను ముట్టడించిన గుండ్లకమ్మ నిర్వాసితులు

By Staff
|
Google Oneindia TeluguNews

ఒంగోలు: ప్రకాశం జిల్లాలోని గుండ్లకమ్మ ప్రాజెక్టు నిర్వాసితులు ఆదివారం రెండో రోజు కూడా తమ ఆందోళనను కొనసాగించారు. ప్రాజెక్టు వద్దనే వారు శిబిరాలను వేసుకుని ఆందోళన సాగిస్తున్నారు. ఆదివారం ఆ ప్రాంతానికి వచ్చిన కలెక్టర్‌ను, శాసనసభ్యులను ఆందోళనకారులు ముట్టడించారు.

జిల్లా కలెక్టర్‌ ఉదయలక్ష్మితో పాటు శాసనసభ్యులు కొందరు ప్రాజెక్టు స్థలానికి వచ్చారు. ఇన్ని రోజులు తమ వైపు కూడా చూడని అధికారులను, శాసనసభ్యులను ఇప్పుడెందుకు వచ్చారని నిర్వాసితులు ప్రశ్నించారు. కలెక్టర్‌తో నిర్వాసితులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. తమ ఐదు గ్రామాలకు నష్టపరిహారం చెల్లించేవరకు పనులను సాగనివ్వబోమని నిర్వాసితులు హెచ్చరిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X