వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సాహితీవేత్త విశ్వనాథ పావనిశాస్త్రి కన్నుమూత
విజయవాడ: కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ తనయుడు, సాహితీవేత్త విశ్వనాథ పావనిశాస్త్రి గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఆయనకు 56 యేళ్లు. కేంద్ర పాలిత ప్రాంతం యానాంలో ఆయన గుండెపోటుతో మరణించారు. విశ్వనాథ పావనిశాస్త్రి కథారచనలో అందెవేసిన చేయి. ఆయన భౌతిక కాయాన్ని స్వస్థలం విజయవాడకు తెచ్చారు.
యానాంలోని ఒక ఇంజనీరింగ్ కళాశాల వార్షికోత్సవంలో ప్రసంగిస్తుండగా పావనిశాస్త్రికి గుండెపోటు వచ్చింది. వెంటనే ఆయనను కాకినాడ ఆస్పత్రికి తరలించారు. అయితే ఆయన అప్పటికే మరణించినట్లు వైద్యులు తేల్చారు. భువనవిజయం వంటి సాహితీ ప్రక్రియల్లో ఆయన విశేష కృషి చేశారు. విశ్వనాథ సత్యనారాయణ రచనలను ఆయన ఎన్నారైల కోసం వరుసగా ముద్రించే పనిలో నిమగ్నమై వున్నారు.
Comments
Story first published: Sunday, April 2, 2006, 23:53 [IST]