వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
హైదరాబాద్లో హ్యూందాయ్ కేంద్రం
హైదరాబాద్: కొరియా కంపెనీ హ్యుందాయ్ హైదరాబాద్లో పరిశోధనా కేంద్రాన్ని స్థాపించనుంది. ఈ కేంద్రం ఏర్పాటు కోసం 42 ఎకరాల స్థలాన్ని కేటాయించడానికి ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి అంగీకరించినట్లు సమాచారం. హ్యూందాయ్ ప్రతినిధి ఒకరు సోమవారం ముఖ్యమంత్రిని కలిసి చర్చలు జరిపారు.
నెల్లూరు జిల్లాలో కార్ల కర్మాగారాన్ని నెలకొల్పడానికి కూడా హ్యూందాయ్ సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇందుకు నెల్లూరు జిల్లాలోని తడ ప్రాంతాన్ని హ్యూందాయ్ ప్రతినిధి బృందం పరిశీలించింది. ఇదే ప్రాంతాన్ని గతంలో జర్మనీ కంపెనీ వోక్స్ ప్రతినిధులు కూడా పరిశీలించారు.
Comments
Story first published: Monday, April 3, 2006, 23:53 [IST]