వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కర్ణాటక, ఎపీల మధ్య ఐటి పోటీ కాదు: వైయస
బెంగుళూర్: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరిశ్రమల స్థాపన విషయంలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య పోటీ ఏమీ లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఈ రెండు రాష్ట్రాలు అభివృద్ధిలో పోటీ పడుతున్నాయని ఆయన అన్నారు. బెంగుళూర్లో ఆయన ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కొద్దిసేపు విలేకరులతో మాట్లాడారు.
కర్ణాకట, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు తమ తమ అభివృద్ధి కోసం పోరాడుతున్నాయని ఆయన అన్నారు. ఇందులో ఒక రాష్ట్రం తక్కువా మరో రాష్ట్రం ఎక్కువా కాదని ఆయన అన్నారు. రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని, ఇందుకు రెండూ పోటీ పడాలని, ప్రగతిని రెండు రాష్ట్రాలు పంచుకోవాలని ఆయన అన్నారు.
Comments
Story first published: Monday, April 3, 2006, 23:53 [IST]