వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పంచాయతీ ఎన్నికలకు టిడిపి వ్యూహం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: వచ్చే పంచాయతీ ఎన్నికల కోసం తెలుగుదేశం పార్టీ వ్యూహాన్ని ఖరారు చేసుకుంటోంది. ఇందుకు పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడి అధ్యక్షతన మంగళవారం సమన్వయాధికారుల కీలక సమావేశం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వంపై దాడిని తీవ్రతరం చేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. సంస్థాగత లోపాలను సరిదిద్ది జిల్లా పార్టీల్లో ఐక్యతను సాధించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు.

పార్టీ వ్యవహారాలపై జిల్లాల వారీగా సమీక్ష జరిపింది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమాలు చేపట్టాలని నిర్ణయించారు. రైతులకు కెపాసిటర్లు, ఫుట్‌బాల్‌లు ప్రభుత్వమే కొని ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ నాయకులు కడియం శ్రీహరి, ఇ. పెద్దిరెడ్డి, తదితరులు మీడియా ప్రతినిధుల సమావేశంలో డిమాండ్‌ చేశారు. కోళ్ల పరిశ్రమను ఆదుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. కాంట్రాక్టర్లు కోట్లాది రూపాయలు దోచి పెడుతున్న ప్రభుత్వం ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని వారు విమర్శించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X