వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మైనారిటీ బుజ్జగింపు విధానాలపై అద్వానీ ధ్వజం

By Staff
|
Google Oneindia TeluguNews

అహ్మదాబాద్‌: ఐక్య ప్రగతిశీల కూటమి (యుపిఎ) మైనారిటీలను బుజ్జగించే విధానాలను అనుసరిస్తోందని భారతీయ జనతా పార్టీ (బిజెపి) సీనియర్‌ నాయకుడు ఎల్‌.కె. అద్వానీ విమర్శించారు. ఆ విధమైన విధానాల వల్ల ఎదురు కానున్న ప్రమాదాల గురించి ప్రజలను చైతన్యవంతులను చేయడానికి, మరో దేశ విభజనను అడ్డుకోవడానికి ఈ యాత్రను చేపట్టినట్లు ఆయన చెప్పారు.

గత సాయంత్రం రాష్ట్రపతి బహిరంగ సభనుద్దేశించి ప్రసంగించడాన్ని గుర్తు చేస్తూ రిజర్వేషన్లు లేకుండానే ఈ దేశంలో అందరికీ సమానావకాశాలున్నాయని అన్నారు. సాయుధ బలగాల్లోని మైనారిటీల లెక్కలు తీయడాన్ని ఆయన తప్పు పట్టారు. ఆ విధమైన చర్య ముస్లింలకు ఉపయోగపడకపోగా ప్రమాదం వాటిల్లుతుందని ఆయన అన్నారు. రిజర్వేషన్లు ఎస్‌సి, ఎస్‌టిలకు మాత్రమే ఉండాలి, మత ప్రాతిపదికపై రిజర్వేషన్లు సరికావని సర్దార్‌ పటేల్‌ అన్నారని, దాన్ని నెహ్రూ కూడా అంగీకరించారని ఆయన గుర్తు చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X