మైనారిటీ బుజ్జగింపు విధానాలపై అద్వానీ ధ్వజం
అహ్మదాబాద్: ఐక్య ప్రగతిశీల కూటమి (యుపిఎ) మైనారిటీలను బుజ్జగించే విధానాలను అనుసరిస్తోందని భారతీయ జనతా పార్టీ (బిజెపి) సీనియర్ నాయకుడు ఎల్.కె. అద్వానీ విమర్శించారు. ఆ విధమైన విధానాల వల్ల ఎదురు కానున్న ప్రమాదాల గురించి ప్రజలను చైతన్యవంతులను చేయడానికి, మరో దేశ విభజనను అడ్డుకోవడానికి ఈ యాత్రను చేపట్టినట్లు ఆయన చెప్పారు.
గత సాయంత్రం రాష్ట్రపతి బహిరంగ సభనుద్దేశించి ప్రసంగించడాన్ని గుర్తు చేస్తూ రిజర్వేషన్లు లేకుండానే ఈ దేశంలో అందరికీ సమానావకాశాలున్నాయని అన్నారు. సాయుధ బలగాల్లోని మైనారిటీల లెక్కలు తీయడాన్ని ఆయన తప్పు పట్టారు. ఆ విధమైన చర్య ముస్లింలకు ఉపయోగపడకపోగా ప్రమాదం వాటిల్లుతుందని ఆయన అన్నారు. రిజర్వేషన్లు ఎస్సి, ఎస్టిలకు మాత్రమే ఉండాలి, మత ప్రాతిపదికపై రిజర్వేషన్లు సరికావని సర్దార్ పటేల్ అన్నారని, దాన్ని నెహ్రూ కూడా అంగీకరించారని ఆయన గుర్తు చేశారు.