వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వైభవంగా భద్రాద్రి సీతారాముల కల్యాణం
భద్రాచలం: ఖమ్మం జిల్లా భద్రాచలంలో సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. వేద మంత్రోచ్ఛారణల మధ్య భద్రాద్రి రాముడు సీత మెడలో మంగళసూత్ర ధారణ చేశాడు. భద్రాద్రి సీతారాములకు మంగళసూత్రం, పట్టు వస్త్రాలను ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి సమర్పించాల్సి ఉంది. అయితే మాతృవియోగం కారణంగా ఆయన వాటిని సమర్పించలేకపోయారు.
దేవాదాయ శాఖ మంత్రి జె.సి. దివాకర్ రెడ్డి, తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి చైర్మన్ టి. సుబ్బరామిరెడ్డి భద్రాద్రి రాముడి కల్యాణోత్సవానికి హాజరయ్యారు. సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని కన్నులారా చూడడానికి రాష్ట్రం నలు మూలల నుంచి భక్తులు విచ్చేశారు.
Comments
Story first published: Friday, April 7, 2006, 23:53 [IST]