వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వర్షం కారణంగా గౌహతి వన్డే రద్దు
గౌహతి: భారత్- ఇంగ్లండ్ జట్ల మధ్య గౌహతిలో ఆదివారం జరగాల్సిన ఐదో వన్డే మ్యాచ్ రద్దయింది. వర్షం కారణంగా పిచ్ చిత్తడిగా మారడంతో మ్యాచ్ నిర్వహణకు పనికిరాదని అంపైర్లు తేల్చడంతో మ్యాచ్ను నిలిపివేశారు. గత కొన్ని రోజులుగా కరుస్తున్న వర్షాల కారణంగా గ్రౌండ్ పూర్తిగా తడిసిపోవడంతో పిచ్ మ్యాచ్ నిర్వహణకు పనికిరాకుండా పోయింది. ఎంతో ఉత్సాహంగా ఆటను ప్రత్యక్షంగా తిలకిద్దామని వచ్చిన అభిమానులు మ్యాచ్ రద్దుతో నిరాశ చెందిస్టేడియంలోకి పెద్ద ఎత్తున ప్లాస్టిక్ బాటిళ్లు విసిరారు. ఏడు వన్డేల ఈ సిరీస్లో భారత్ 4-0 ఆధిక్యంలో ఉంది. రెండు జట్ల మధ్య తదుపరి మ్యాచ్ 12ప జంషెడ్పూర్లో జరుగుతుంది.
Comments
Story first published: Sunday, April 9, 2006, 23:53 [IST]