ఐడియా సెల్యులార్ బిర్లాల చేతికి!
హైదరాబాద్:
టాటా-బిర్లాల
మధ్య
వివాదానికి
కారణమైన
ఐడియా
సెల్యులర్
కంపెనీలో
వాటాల
విక్రయం
వివాదం
త్వరలో
పరిష్కారమయ్యే
అవకాశముంది.
ఐడియాలో
టాటాలకు
ఉన్న
48
శాతం
వాటాలను
కొనుగోలు
చేసేందుకు
మలేషియాకు
చెందిన
మ్యాక్సిస్
టెలికామ్
అనే
సంస్థ
ఆపర్
ఇచ్చినట్లుగా
వార్తలు
వెలువడ్డాయి.
దీనికి
దీటుగా
ప్రధాన
వాటాదారుగా
తనకున్న
హక్కును
వినియోగించుకుంటూ
బిర్లా
గ్రూపు
మ్యాచింగ్
బిడ్
సమర్పించేందుకు
సిద్ధమైంది.
మ్యాక్సిస్
ఇటీవలే
చెన్నెలో
శివశంకరన్కు
చెందిన
ఎయిర్సెల్ను
కొనుగోలు
చేసింది.
మ్యాక్సిస్
బిడ్కు
సమానమైన
బిడ్ను
ఆదిత్యబిర్లా
గ్రూపు
ఇచ్చిందని
టాటా
సన్స్
లిమిటెడ్
చైర్మన్
రతన్టాటా
కూడా
అంగీకరించారు.
శనివారంనాడు
ఐఎస్బిలో
విలేఖరులతో
మాట్లాడుతూ
మ్యాక్సిస్
బిడ్కు
సమానమైన
ఆఫర్
ఇవ్వాలని
బిర్లా
గ్రూపు
నిర్ణయించిందని,
అయితే
తాము
ఇప్పటి
వరకూ
ఎవి
బిర్లా
గ్రూపు
ప్రతినిధులతో
సమావేశం
కాలేదని
రతన్టాటా
చెప్పారు.