వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
జూలైలో ఎస్బిహెచ్ పబ్లిక్ ఇష్యూ
హైదరాబాద్: ఈ ఏడాది జూలైలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ పబ్లిక్ ఇష్యూకు వచ్చే అవకాశం వుంది. ఈ విషయం బ్యాంకు చీఫ్ జనరల్ మేనేజర్ సిన్హా సూచనప్రాయంగా తెలిపారు. మనీ ట్రాన్స్ఫర్కు సంబంధించి యుఎఇ ఎక్స్చేంజ్తో టైఅప్కుదుర్చుకున్న సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసికంలో తమ బ్యాంకు ఐపిఓ జారీ చేయనున్నట్లు సిన్హా వెల్లడించారు. తమ బ్యాంకు ఈ ఏడాది 56 వేల కోట్ల రూపాయల వ్యాపారాన్ని సాధించిందని, 2008 నాటికి 100000 కోట్ల రూపాయల వ్యాపారం సాధించాలన్నది లక్ష్యమని ఆయన చెప్పారు. ఐపిఓ పరిమాణం ఎంత ఉండాలి, షేరు ధర ఎంత నిర్ణయించవచ్చు అన్న అంశాలపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు.
Comments
Story first published: Sunday, April 9, 2006, 23:53 [IST]