వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రైతులకు ఏడు గంటల సేపు కరెంట్: వైఎస్
విజయవాడ: కృష్ణాజిల్లాలో ప్రజాపథం కార్యక్రమాన్నిముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ఆదివారం ప్రారంభించారు. రైతులకు ఏడు గంటల పాటు వ్యవసాయ విద్యుత్ సరఫరా చేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. రాష్ట్రంలో విద్యుత్ వినియోగం అధికంగా ఉండడం వల్ల సరఫరాలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని ఆయన తెలిపారు. అవసరమైతే పట్టణ ప్రాంతాలకు విద్యుత్ సరఫరాను తగ్గించి అయినా వ్యవసాయానికి విద్యుత్ కొరత లేకుండా చేస్తామని ఆయన చెప్పారు. నూజివీడులో పట్టణంలో గృహనిర్మాణ పథకాన్ని ఆయన ప్రారంభించారు.
Story first published: Sunday, April 9, 2006, 23:53 [IST]