వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైఎస్‌కు ఢిల్లీలో సీన్‌ లేదు: నరేంద్ర

By Staff
|
Google Oneindia TeluguNews

మెదక్‌: కాంగ్రెస్‌ అధిష్టానవర్గం వద్ద ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి పలుకుబడి బాగా క్షీణించిందని టిఆర్‌ఎస్‌ నాయకుడు, కేంద్ర మంత్రి నరేంద్ర అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడబోదంటూ వైఎస్‌ బెంగుళూరులో చేసిన వ్యాఖ్యలపై అధిష్టానవర్గం సీరియస్‌ అయిందని, ఆయనను తీవ్రంగా మందలించిందని అయన చెప్పుకొచ్చారు. ఈనెల 27న పెరేడ్‌ గ్రౌడ్స్‌లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపనున్నామని, ఆ బహిరంగ సభకు ఐదు లక్షల మంది హాజరవుతారని ఆయన చెప్పారు. టిఆర్‌ఎస్‌కు రాష్ట్రంలో అవమానాలు ఎదురవుతున్నా, ఢిల్లీలో మంచి పలుకుబడి ఉందని నరేంద్ర తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు సోనియాగాంధీ సుముఖంగా ఉన్నారని, అధిష్టానవర్గాన్ని ధిక్కరిస్తే వైఎస్‌ పదవికే ముప్పు ఏర్పడుతుందని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X