వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వ్యభిచారం చేస్తున్న వైస్ చైర్మన్ సహా 7గురు అరెస్టు
కరీంనగర్: వ్యభిచారం నిర్వహిస్తూ కరీంనగర్ జిల్లా సిరిసిల్లా వైస్ చైర్మన్ గడ్డం పరుశురాంతో సహా ఏడుగురు పోలీసుల చేతికి చిక్కారు. పోలీసులకు చిక్కిన వారిలో ఒక కౌన్సిలర్ కూడా ఉన్నాడు. అరెస్టయిన ఏడుగురిలో ఐదుగురు పురుషులు కాగా, ఇద్దరు మహిళలు. హైదరాబాద్ నుంచి ఒక బాలికను తెచ్చి వ్యభిచారం నిర్వహిస్తుండగా వారిని అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు.
హౌసింగ్ బోర్డు కాలనీలో సంజీవినీ ఇండస్ట్రీస్ అనే పేరుతో ఇద్దరు మహిళలు ఒక సంస్థ బోర్డు తగిలించారు. వివిధ ప్రాంతాల నుంచి మహిళలను తెచ్చి వారిద్దరు వ్యభిచారం నిర్వహిస్తున్నారనే సమాచారం అందడంతో పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో ఈ ఏడుగురు పట్టుబడ్డారు.
Story first published: Tuesday, April 11, 2006, 23:53 [IST]