వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రైతు చర్యలపై బహిరంగ చర్చ: రఘువీరా సవాల్
హైదరాబాద్: ఎవరి ప్రభుత్వ హయాంలో రైతుల మేలు కోసం చర్యలు తీసుకున్నారో బహిరంగ చర్చకు రావాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఎన్. రఘువీరారెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకులను సవాల్ చేశారు. పంచాయతీరాజ్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రైతుల కోసం ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు నటిస్తోందని తెలుగుదేశం నాయకులు చేసిన విమర్శను ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఖండించారు.
రైతుల ఆత్మహత్యలు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే ప్రారంభమయ్యాయని ఆయన విమర్శించారు. రైతుల ఆత్మహత్యలను ఆ రోజుల్లో తెలుగుదేశం నాయకులు అవహేళన చేశారని ఆయన అన్నారు. తాము 23 నెలల కాలంలో రైతుల కోసం తీసుకున్న చర్యలు తెలుగుదేశం తొమ్మిదేళ్ల పాలనలో కూడా తీసుకోలేదని ఆయన అన్నారు.
Comments
Story first published: Tuesday, April 11, 2006, 23:53 [IST]