వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చికెన్‌గున్యా మరణాలు లేవు: రోశయ్య

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: రాష్ట్రంలో చికెన్‌గున్యా మరణాలు సంభవించలేదని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కె. రోశయ్య స్పష్టం చేశారు. చికెన్‌గున్యా వ్యాధి వల్ల మరణాలు సంభవించవని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ఈ విషయంలో మీడియా వార్తలు అన్నీ అబద్ధాలేనని ఆయన వ్యాఖ్యానించారు. చెకెన్‌గున్యా వ్యాధి వల్ల కీళ్ల నొప్పులు వస్తాయని, జ్వరం వస్తుందని ఆయన చెప్పారు.

దాదాపు 15 వేల మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారని ఆయన చెప్పారు. చెకెన్‌గున్యాధికి బాధ్యత వహించి రాజీనామా చేయాలని తనను తెలుగుదేశం పార్టీ నాయకుడు నాగం జనార్దన్‌ రెడ్డి డిమాండ్‌ చేయడాన్ని ఆయన తిరస్కరించారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మలేరియా, ఎయిడ్స్‌ వ్యాధులతో ఎంతో మంది మరణించినా అప్పటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రాజీనామా చేయలేదని ఆయన అన్నారు. చికెన్‌గున్యా వ్యాధి నియంత్రణకు తాము అన్ని చర్యలూ తీసుకున్నామని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X