వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పోలీసు కాల్పుల్లో మృతులు అమాయకులే: జానా
హైదరాబాద్: వరంగల్, మెదక్ జిల్లాల్లో పోలీసు కాల్పుల్లో మరణింంచింది అమాయకులేనని హోం మంత్రి కె. జానారెడ్డి అంగీకరించారు. కాల్పులకు బాధ్యులైనవారిపై చర్యలు తీసుకుంటామని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. ఈ విషయంలో ప్రభుత్వం బుకాయించడం లేదని ఆయన అన్నారు.
వరంగల్, మెదక్ జిల్లాల్లో పోలీసు కాల్పుల్లో ఇద్దరు అమాయకులు మరణించిన సంఘటనలపై ఇద్దరు ఐజిలతో విచారణ జరిపిస్తున్నట్లు ఆయన తెలిపారు. నివేదిక అందగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. సంఘటన ఏ విధంగా జరిగిందనేదాని మీదనే విచారణ జరిపిస్తున్నామని, మృతులు ఎవరనేది తెలిసిపోయినందున ఈ విషయంలో విచారణ అవసరం లేదని ఆయన అన్నారు. తనను నక్సలైట్లు టార్గెట్ చేసినా ప్రజాసేవ నుంచి తప్పుకోనని ఆయన అన్నారు.
Comments
Story first published: Friday, April 14, 2006, 23:53 [IST]