వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మే 14న పునరకింత సభ: కేశవరావు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: తమ పార్టీ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లయిన సందర్భంగా వచ్చే నెల 14వ తేదీన హైదరాబాద్‌ పునరంకిత సభ నిర్వహించనున్నట్లు ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డాక్టర్‌ కె. కేశవరావు చెప్పారు. పార్టీ రాష్ట్ర స్థాయి ప్లీనంలా ఈ సభ జరుగుతుందని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. ఈ సభలో 15 వేల మంది పాల్గొంటారని ఆయన చెప్పారు.

ఈ సభ నిర్వహణకు కార్యనిర్వహణ కమిటీని వేయనున్నట్లు ఆయన తెలిపారు. గత రెండేళ్ల కాలంలో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను సమీక్షించి, భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యక్రమాలను రూపొందించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సభలో ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డితో పాటు ఎ ఐసిసి పర్యవేక్షకులు పాల్గొంటారని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X