వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వరంగల్ జిల్లాలో నలుగురు నక్సల్స్ హతం
వరంగల్: వరంగల్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు ప్రజాప్రతిఘటన నక్సల్స్ హతమయ్యారు. వరంగల్ జిల్లా తాడ్వాయి మండలం కాటాపూర్ అడవుల్లో పోలీసులకు, నక్సల్స్కు మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో నలుగురు నక్సల్స్ మరణించినట్లు పోలీసులు చెప్పారు. మరణించినవారిలో ఒక మహిళ నక్సలైట్ కూడా ఉంది. సంఘటనా స్థలం నుంచి పోలీసులు నాలుగు తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. మృతుల్లో ప్రజాప్రతిఘటన జిల్లా కార్యదర్శి యాదన్న ఉన్నట్లు అనుమానిస్తున్నారు.
Comments
Story first published: Friday, April 21, 2006, 23:53 [IST]