వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చెరువులో 4గురు: రోడ్డు ప్రమాదాల్లో 15 మంది మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: మెదక్‌ జిల్లా రామచంద్రాపురం సమీపంలోని బీరంగూడా గ్రామంలో నలుగురు చిన్నారుల కుటుంబాలను విషాదంలో ముంచెత్తింది. నలుగురు బాలురు చెరువులో పడి మరణించడంతో ఆ గ్రామంలో విషాదం నెలకొంది. వారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తుండగా గ్రామస్థులను ఆ సంఘటన కలచివేస్తోంది. నలుగురు పిల్లలు తామరపువ్వులు కోయడానికి ఊరి చెరువులోకి దిగారు. ఈత రాకపోడంతో వారు అందులో మునిగి మరణించారు. ప్రతాప్‌కుమార్‌, నితీష్‌కుమార్‌, నితిన్‌లతో పాటు మరో బాలుడు మృతి చెందినవారిలో ఉన్నారు.

ఇదిలావుంటే, రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో జరిగిన వేర్వేరు ప్రాంతాల్లో 15 మంది మరణించారు. రోడ్డు ప్రమాదంలో మరణించిన హైదరాబాదీవాసులది అత్యంత విషాదకరమైన గాథ. మరణించిన తండ్రిని చివరి చూపు చూసేందుకు వెళ్తున్న వ్యక్తి కుటుంబసభ్యులందరూ రోడ్డు ప్రమాదంలో మృత్యువు వెంటాడిన కథ అది. హైదరాబాద్‌లోని మలక్‌పేటలో ఉంటున్న ప్రభాకరాచారి తండ్రి నర్సింహాచారి స్వస్థలం రంగారెడ్డి జిల్లా ధర్మన్నగూడెంలో మరణించాడు. తండ్రి మరణవార్త విన్న ప్రభాకరాచారి భార్య రాజేశ్వరి, కుమారుడు అజయ్‌, బావమరిది శంకరాచారిలతో కలిసి స్కూటర్లపై ధర్నన్నగూడెం బయలుదేరారు. ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టడంతో ఆ నలుగురు అక్కడికక్కడే మరణించారు.

ఇదిలావుంటే, విశాఖపట్నం జిల్లా భిమిలీ మండలంలోని కాపుల ఉప్పాడ - బోయపల్లి మార్గంలో క్వారీ లారీ బోల్తా పడడంతో ఆరుగురు కూలీలు మరణించారు. విశాఖపట్నంలో ఆగివున్న లారీని జీపు ఢీకొట్టడంతో ఒక వ్యక్తి మరణించాడు, మరో ఏడుగురు గాయపడ్డారు. గాయపడినవారిని కెజిహెచ్‌ ఆస్పత్రిలో చేర్చారు. ఇందులో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. నెల్లూరులో పుచ్చకాయల వ్యాపారులపై నుంచి లారీ పోవడంతో ఇద్దరు మరణించారు. నిజామాబాద్‌ జిల్లా మింగారం గ్రామం వద్ద పెళ్లి బృందం ప్రయాణిస్తున్న ట్రాక్టర్‌ బోల్తా పడడంతో ఇద్దరు మరణించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X