వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిడిపి ట్రాప్‌లో విశాఖ పోలీసులు: కేశవరావు

By Staff
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: విశాఖపట్నం - 1 శాసనసభ ఉప ఎన్నిక సందర్భంగా స్థానిక పోలీసులు తెలుగుదేశం పార్టీ ట్రాప్‌లో పడి తమ పార్టీ కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డాక్టర్‌ కె. కేశవరావు విమర్శించారు. విశాఖపట్నంలో పోలీసులు తెలుగుదేశం పార్టీ కొమ్ము కాస్తున్నారని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో విమర్శించారు. విశాఖ - 1 పోలింగ్‌కు అడ్డంకులు కల్పించడానికి ప్రయత్నిస్తున్న తెలుగుదేశం పార్టీవారికి పోలీసులు సహకరిస్తున్నారని ఆయన అన్నారు.

తెలుగుదేశం, కాంగ్రెస్‌ సభలకు ఒకే చోట అనుమతి ఇవ్వడం సరైంది కాదని ఆయన అన్నారు. తెలుగుదేశం దుష్ట ప్రయత్నాలను అర్థం చేసుకోవాలని ఆయన పోలసులను కోరారు. పోలీసుల తీరుపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణపై భారతీయ జనతా పార్టీ (బిజెపి) సీనియర్‌ నేత ఎల్‌.కె. అద్వానీ చేసిన ప్రకటనను విశ్వసించలేమని ఆయన అన్నారు. తెలంగాణపై అద్వానీ ఏడు రకాల ప్రకటనలు చేశారని, అటువంటప్పుడు అద్వానీ ప్రకటనను నమ్మడం కష్టమని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X