వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిరంజీవి ఘన సన్మానానికి ఏర్పాట్లు పూర్తి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: పద్మభూషణ్‌ అందుకున్న తెలుగు సినిమా హీరో చిరంజీవి సన్మానానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. తెలుగు చిత్రపరిశ్రమ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం గచ్చిబౌలి స్టేడియంలో చిరంజీవికి సన్మాన కార్యక్రమం ప్రారంభమైంది. పద్మభూషణ్‌ చిరంజీవికి బిగ్‌ బి అమితాబచ్చన్‌ చేతులుగా మీదుగా సన్మానం చేసేందుకు తెలుగు చిత్రపరిశ్రమ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సన్మాన కార్యక్రమం నిర్వహించేందుకు అమితాబ్‌ హైదరాబాద్‌ చేరుకున్నారు. చిరంజీవి సరసన నటించిన నటీమణులందరినీ ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. ప్రముఖ నటి శోభన నృత్యప్రదర్శనతో కార్యక్రమం ప్రారంభమవుతుంది. అనంతరం ప్రముఖ నృత్య దర్శకుడు రాజు సుందరం నేతృత్వంలో నిర్వహించే నృత్య కార్యక్రమంలో ప్రముఖ హీరోయిన్లు పాల్గొంటారు. చిరంజీవి మేనల్లుడు అల్లు అర్జున్‌ కూడా ఈ నృత్య కార్యక్రమంలో పాల్గొంటాడు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X