వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రమోద్‌ మహాజన్‌ క్రమంగా సురక్షితం

By Staff
|
Google Oneindia TeluguNews

ముంబై: తమ్ముడి కాల్పుల్లో గాయపడి చికిత్స పొందుతున్న బిజెపి ప్రధాన కార్యదర్శి ప్రమోద్‌ మహాజన్‌ ఆరోగ్యం కొద్దిగా మెరుగయిందని హిందుజా ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. అయితే పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. మహాజన్‌ స్పృహలోకి వచ్చారని, కాళ్లు, చేతులు కదిలించారని వైద్యులు ప్రకటించారు. వెంటిలేటర్‌ ద్వారా మహాజన్‌కు కృత్రిమశ్వాస అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఉదయం మహాజన్‌ కుమార్తె పూనమ్‌, బావమరిది గోపినాథ్‌ ముండే, బిజెపి అధ్యక్షుడు రాజ్‌నాథ్‌ సింగ్‌లు ఇంటెన్సివ్‌ కేర్‌లో ఉన్న మహాజన్‌ను కలిశారు. మహాజన్‌ వారిని గుర్తుపట్టారని వైద్యులు ధృవీకరించారు. మహాజన్‌కు కాలేయం నుంచి వెలువడుతున్న రక్తస్రావం అదుపు చేశామన్నారు. కాలేయ మార్పిడి శస్త్రచికిత్స నిర్వహించేందుకు లండన్‌ నుంచి ముంబై చేరుకున్న ప్రత్యేక వైద్య నిపుణుడు మహమ్మదే రేలా హిందుజా ఆసుపత్రి వైద్యులతో సమావేశమయ్యారు. మహాజన్‌కు రెండో శస్త్ర చికిత్సపై ఈ సాయంత్రంగా నిర్ణయం తీసుకుంటామని వైద్యులు ప్రకటించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X