వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
దేవాదాయ భూవివరాలు ఇస్తే పారితోషికం: జెసి
హైదరాబాద్: ప్రభుత్వ దృష్టికి రాని దేవాదాయ భూముల వివరాలు చెప్పితే పారితోషికం ఇస్తామని దేవాదాయ శాఖ మంత్రి జె.సి. దివాకర్ రెడ్డి ప్రకటించారు. ప్రభుత్వం దృష్టికి రాని దేవాదాయ భూముల ఆక్రమణ సంఘటనలు చాలా ఉన్నాయని, ఈ విషయాన్ని వెలికితీయడానికి ప్రజల తోడ్పాటు కోరుతున్నామని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు.
మెట్ట భూమి అయితే ఎకరాకు 250 రూపాయలు, సాగుభూమి అయితే 500 రూపాయలు ఇస్తామని, పట్టణాల్లో, నగరాల్లో 5000 రూపాయలు పారితోషికంగా ఇస్తామని ఆయన చెప్పారు. వివరాలు చెప్పినవారి పేర్లు గోప్యంగా ఉంచుతామని కూడా ఆయన చెప్పారు. ఇందుకు ఒక ప్రత్యేక విభాగం ఈ రోజు నుంచే పని చేస్తోందని ఆయన చెప్పారు.
Comments
Story first published: Wednesday, April 26, 2006, 23:53 [IST]