వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహేష్‌బాబును మేం చూడలేదు: సాక్షులు

By Staff
|
Google Oneindia TeluguNews

వరంగల్‌: మహేష్‌బాబు ఎవరో తమకు తెలియదని సాక్షులు వరంగల్‌ కోర్టులో సాక్ష్యం చెప్పారు. కిడ్నాప్‌, వీడియో దుకాణాలపై దాడి కేసుల్లో సినీ నటుడు మహేష్‌ బాబు బుధవారం వరంగల్‌ కోర్టులో హాజరయ్యాడు. మహేష్‌బాబు ఎవరో తమకు తెలియదని, వీడియో దుకాణాలపై దాడి చేసింది ఎవరో తాము గుర్తు పట్టలేమని సాక్షులు చెప్పారు. ఈ కేసుల్లో కోర్టు 42 మంది సాక్షులను విచారించాల్సి వుండగా ఇప్పటి వరకు 15 మందిని విచారించింది.

తాము మహేష్‌బాబును చూడలేదని కూడా వారు చెప్పారు. ఘర్షణ జరిగిందని, దుండగులు దాడి చేసినట్లు చూశామని, అయితే దాడికి దిగింది ఎవరో గుర్తించలేమని వారు చెప్పారు. ఈ కేసుల విచారణ మరో రెండు రోజులు సాగుతుంది. అర్జున్‌ సినిమా వీడియో పైరసీ జరుగుతుందనే కోపంతో మహేష్‌బాబు, దర్శకుడు గుణశేఖర్‌, మరికొంత మంది వరంగల్‌లోని వీడియో దుకాణాలపై దాడి చేశారని, ఒక వ్యక్తిని కిడ్నాప్‌ చేశారని ఆరోపిస్తూ కేసు నమోదైంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X